జగ్గంపాలెం, జియ్యంపాలెం గ్రామాల్లో గౌరవ సభ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 7 డిసెంబర్ 2021: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండలంలోని జగ్గంపాలెం, జియ్యంపాలెం గ్రామాల్లో టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు పాము అర్జున ఆధ్వర్యంలో గౌరవ సభ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఓటిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ నాయకులు అరాచకాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి కనిగిరి రాంబాబు, టీడీపీ నాయకులు భాను ప్రకాష్, వీరబాబు, బద్రి, రామకృష్ణ, నరసన్న దొర తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us