UPDATED 11th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గ స్థాయిలో 17సంవత్సరాల లోపు బాల, బాలికలకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం కబడ్డీ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో బాలుర విభాగంలో సామర్లకోట మండలం టీమ్ ప్రధమస్థానం, బాలికల విభాగంలో పెద్దాపురం మండలం టీమ్ ద్వితీయస్థానంలో నిలిచినట్లు న్యాయనిర్ణేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారావు, బంగార్రాజు, వైకుంఠం, వేంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం, జయలక్ష్మి, ఉమామహేశ్వరరావు, విశ్వేశ్వరరావు, బండారు శ్రీనివాస్, సునయన, శ్రీదేవి, కబడ్డీ కోచ్ లు కృపావతి, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.







