గంగవరం (రెడ్ బీ న్యూస్) 31 అక్టోబర్ 2021: మండలంలోని ఆమదాలబందకు చెందిన చుండం వెంకటేశ్వర్లు వ్యవసాయ కూలీగా పని చేసుకుంటూ కొద్ది రోజుల క్రితం పాముకాటుకు గురై మృతి చెందాడు. అడ్డతీగల గురుకుల పాఠశాలలో 1998 పదవ తరగతి పూర్వ విద్యార్థులు తమ తోటి స్నేహితుడు మృతిచెందాడని తెలుసుకుని అతని కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. స్నేహితుని కుటుంబానికి రూ.12 వేల నగదు సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీతారపు నానాజీ, రాజబాబు, ప్రసన్నకుమార్, సత్యనారాయణ, వెంకట్రావు, గవాస్కర్, సింహాద్రి, సుబ్బారావు, శ్రీనుబాబు, కన్నయ్య, శ్రీనివాస్, సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







