UPDATED 22nd DECEMBER 2018 SATURDAY 10:00 PM
సామర్లకోట: రాష్ట్ర ప్రభుత్వం చర్మ వృత్తికారులు, డప్పు కళాకారులకు మంజూరు చేయనున్న పింఛన్లకు 21మంది దరఖాస్తు చేసుకోగా తొలివిడతగా 12 దరఖాస్తులు పరిశీలించి పింఛన్ మంజూరుకు అర్హతగా గుర్తించినట్లు మున్సిపల్ కమీషనర్ సిహెచ్ వెంకటేశ్వరావు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి మున్సిపల్ కమీషనర్ తమ కార్యాలయ సిబ్బందితో వారి ఇళ్ళకు వెళ్ళి సమాచారం సేకరించారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ రాబోయే జన్మభూమి గ్రామసభల్లో వీటిని పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.







